వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విశాఖ - 1లో ద్రోణంరాజు శ్రీనివాస్ విజయం
విశాఖపట్నం: విశాఖపట్నం -1 శాసనసభా నియోజకవర్గం నుంచి కాం।గెస్ అభ్యర్థి ద్రోణంరాజు శ్రీనివాస్ విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం అభ్యర్థి రెహ్మాన్పై 14,150 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బిజెపి అభ్యర్థితో సహా 12 మంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి.
ఇంతకు ముందు పోలింగ్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణపై ఎన్నికల కమీషన్ నియోజకవర్గమంతటా రీపోలింగ్కు ఆదేశించింది. దీంతో నియోజకర్గం ఉప ఎన్నిక ప్రచారం సుదీర్ఘంగా సాగింది. ద్రోణంరాజు శ్రీనివాస్ తండ్రి, కాంగ్రెస్ కురువృద్ధుడు ద్రోణంరాజు సత్యనారాయణ మృతితో విశాఖ -1 నియోజకవర్గానికి ఉప ఎన్నికల నిర్వహించాల్సి వచ్చింది.
Story first published: Thursday, April 27, 2006, 23:53 [IST]