వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విశాఖ -1 గెలుపుతో మరింత ఉత్సాహం: వైయస్
హైదరాబాద్: విశాఖపట్నం - 1 శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయం తమకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్ని ఎత్తులు వేసినా ప్రజలు నమ్మలేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు నాయకత్వంలో పార్టీ కలిసికట్టుగా పని చేసిందని ఆయన కొనియాడారు. తమ ప్రభుత్వానికి, తమ పార్టీకి, సోనియా నాయకత్వానికి ప్రజలు మద్దతు తెలిపారని ఆయన అన్నారు. కండబలం, ధనం బలం వల్లనే విశాఖ - 1 నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆదిలాబాద్ జిల్లాలో విమర్శించారు.
Comments
Story first published: Thursday, April 27, 2006, 23:53 [IST]