వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాయలసీమలో 11 మంది నక్సల్స్‌ హతం

By Staff
|
Google Oneindia TeluguNews

కడప: రాయలసీమలో శుక్రవారం ఉదయం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 11 మంది నక్సల్స్‌ హతమయ్యారు. వీరిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. మృతులను గుర్తించలేదు. అయితే హతుల్లో అనంతపురం, కడప జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులు ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో 30 మంది నక్సల్స్‌ పాల్గొన్నారని, మిగతా వారు పారిపోయారని పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ (డిజిపి) స్వరణ్‌ జిత్‌ సేన్‌ హైదరాబాద్‌లో చెప్పారు. పారిపోయినవారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు. కడప, చిత్తూరు జిల్లాల సరిహద్దులోని సుండుపల్లె అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది.

ఎన్‌కౌంటర్‌ ఉదయం ఆరున్నర గంటల నుంచి దాదాపు గంటన్నర పాటు కొనసాగిందని పోలీసులు చెబుతున్నారు. సంఘటనా స్థలం నుంచి పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పోలసులు స్వాధీనం చేసుకున్నవాటిలో ఒక టెంట్‌, 25 కిట్‌ బ్యాగులు, 2 ఎస్‌యల్‌ఆర్‌ గన్‌లు, ఒక 303 రైఫిల్‌, మూడు సింగిల్‌ బ్యారెల్‌ గన్‌లు ఉన్నాయి. నక్సలైట్లు అక్కడ రాజకీయ, మిలటరీ శిబిరం నిర్వహిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఒక ఎన్‌కౌంటర్‌లో ఇంత పెద్ద యెత్తున నక్సల్స్‌ చనిపోవడం ఇదే మొదటిసారి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X