వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవినీతిని నిలదేస్తే కేసులా?: చంద్రబాబు

By Staff
|
Google Oneindia TeluguNews

కరీంనగర్‌: అవినీతిని నిలదీస్తే శాసనసభ్యులపై కేసులు పెడతారా? అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎల్లంపల్లి వ్యవహారంలో తెలుగుదేశం శాసనసభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఆ ప్రశ్న వేశారు. కరీంనగర్‌ జిల్లాలో శుక్రవారం ఏర్పాటయిన సభలో ఆయన ప్రసంగించారు.

నీటి పారుదల ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వంలోని పెద్దలు కోట్ల రూపాయలు దండుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఉచిత విద్యుత్‌ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ఇప్పుడు రైతుల ఉసురు పోసుకుంటోందని ఆయన వ్యాఖ్యానించారు. వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరాను తొమ్మిది గంటల నుంచి ఏడు గంటలకు తగ్గించి ఐదు గంటలు మాత్రమే ఇస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం సామాన్యుల సంక్షేమాన్ని విస్మరిస్తోందని ఆయన విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X