వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య
హైదరాబాద్: హైదరాబాద్లోని ఖైరతాబాద్లో గల ఆనందనగర్లో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని దుండగులు హత్య చేశారు. సైలెన్సర్ బిగించిన రివాల్వర్తో దుండగులు ఇంట్లోనే అతన్ని హత్య చేశారు. రక్తమడుగులో శవం ఇంటిలోని మంచంపై పడి ఉంది. సంఘటనా స్థలంలో పడి వున్న రివాల్వర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ హత్యకు సంబంధించి పోలీసులు పనివారిని అనుమానిస్తున్నారు. ఆ వ్యాపారి తన సోదరుడితో కలిసి ఆ ఇంటిలో ఉంటున్నాడని తెలుస్తోంది. ఆ ఇంటిలో ఒక నేపాలీ పని చేస్తున్నాడని, ఆ పరిసరాల్లో మరో నలుగురు నేపాలీలు ఉండేవారని, హత్య జరిగినప్పటి నుంచి వారు కనిపించడం లేదని పోలీసులు అంటున్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Story first published: Friday, April 28, 2006, 23:53 [IST]