వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దామోదర్రెడ్డివన్నీ అబద్ధాలు: జానారెడ్డి
హైదరాబాద్: తన నుంచి ప్రాణహాని ఉన్నదని నల్లగొండ జిల్లా తుంగతుర్తి కాంగ్రెస్ శాసనసభ్యుడు ఆర్. దామోదర్ రెడ్డి తనపై చేసిన ఆరోపణను రాష్ట్ర హోం మంత్రి కె. జానారెడ్డి ఖండించారు. హోం మంత్రి జానారెడ్డి తనకు ప్రాణహాని ఉందని దామోదర్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణపై జానారెడ్డి శుక్రవారంనాడు ప్రతిస్పందించారు.
తనకు కుట్రలు, కుతంత్రాలు తెలియవని ఆయన చెప్పుకున్నారు. దామోదర్ రెడ్డికి ఆపోహలేమైనా ఉంటే వాటిని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి సమక్షంలో పరిష్కరించుకోవడానికి తాను సిద్ధంగా వున్నానని ఆయన ప్రకటించారు. ఎవరినీ అణచివేయడానికి తాను ఏనాడూ పని చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తాను చీమకు కూడా హాని తలపెట్టినవాడిని కానని ఆయన అన్నారు.
Comments
Story first published: Friday, April 28, 2006, 23:53 [IST]