వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మావోయిస్టుల కనెక్షన్తో ఇద్దరి అరెస్టు
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో మావోయిస్టులకు అందజేయడానికి మారణాయుధాలను రవాణా చేస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పెద్ద యెత్తున మందుగుండ సామగ్రిని, ఆధునిక కమ్యూనికేషన్ పరికరాలను, నగదును స్వాధీనం చేసుకున్నారు. శేషగిరి రావు అనే మాజీ ఎంపిపిని, గణేష్ కన్స్ట్రక్షన్కు చెందిన ప్రసాదరావు అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో తెలుగుదేశం నాయకుడు గరికిపాటి మోహన్రాపుపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
అరెస్టయినవారి నుంచి పోలీసులు 50 కిలోల జిలెటన్ స్టిక్స్ను, 20 డెటనేటర్లను, 5 సెల్ఫోన్లను, మూడు ల్యాప్ట్యాప్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని మావోయిస్టు కార్యదర్శి జంపన్నకు అందజేయడానికి వీరు కారులో తీసుకునిపోతూ పట్టుబడ్డారని పోలీసులు చెప్పారు.
Comments
Story first published: Friday, April 28, 2006, 23:53 [IST]