వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సూర్యనారాయణ మృతదేహాన్ని గుర్తించిన అధికారులు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఆఫ్ఘనిస్ధాన్‌లో తాలిబాన్ల దురాగతానికి బలైన సూర్యనారాయణ మృత దేహాన్ని అక్కడికి వెళ్ళిన భారతీయ అధికార బృందం గుర్తించింది. ఆయన మృతదేహాన్ని కాందహార్‌లో కనుగొన్నారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చెప్పారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా దేశ ప్రజలందరూ సమైక్యం కావాలని ఆయన పిలుపు ఇచ్చారు. సూర్యనారాయణ కుటుంబ సభ్యులను ఆదివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పరామర్శించారు. ఆఫ్ఘానిస్తాన్‌లో తానిబన్ల కర్కశత్వానికి బలైన ఆంధ్రప్రదేశ్‌ ఇంజనీర్‌ సూర్యనారాయణ కుటుంబానికి రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. తాలిబన్ల చర్యను రాష్ట్రపతి కలామ్‌ తీవ్రంగా ఖండించారు. సూర్యనారాయణ కుటుంబాన్ని ఆర్థికంగాను, నైతికంగాను ఆదుకుంటామని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రకటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X