రికార్డు బుక్కుల్లోకి బుడుతడి పరుగు
భువనేశ్వర్: ఒరిస్సా రాష్ట్రానికి చెందిన నాలుగేళ్ల బుడతడు 65 కిలోమీటర్ల దూరం ఏడు గంటల రెండు నిమిషాల్లో పరుగెత్తి లిమ్కా బుక్ ఆప్ రికార్డుల్లోకి ఎక్కాడు. బుధియా అనే ఆ పసికందు మంగళవారంనాడు పూరి నుంచి భువనేశ్వర్ వరకు పరుగు తీసి ఈ రికార్డు సృష్టించాడు. అంత చిన్న వయస్సులో అంత దూరం పరుగు తీసి మొదటి బాలుడిగా బుథియా రికార్డు సృష్టించాడు. నిజానికి పూరీలోని జగన్నాథాలయం నుంచి భువనేశ్వర్లోని సి ఆర్పియఫ్ సెంటర్ వరకు 70 కిలోమీటర్లు పరుగు తీయాలనేది అతని లక్ష్యం. అయితే భువనేశ్వర్లోకి ప్రవేశించగానే ప్రజలు బుథియాను పూలదండలతో ముంచెత్తడం మొదలు పెట్టారు. దీంతో అతనికి ఊపిరాడడం కష్టమైంది. వైద్యుల సలహా మేరకు ముందుగానే తన పరుగును ఆపేశాడు.
బుథియా పరుగు రికార్డు అని, దీన్ని హ్యూమన్ ఇంటరెస్టు స్టోరీగా పరిగణిస్తామని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల అసిస్టెంట్ ఎడిటర్ అమ్రీన్ టూర్ అన్నారు. తాము బుథియా జననాన్ని, గత నాలుగేళ్ల జీవితాన్ని నమోదు చేస్తామని ఆయన చెప్పారు. ఇతరులకు ప్రేరణ ఇచ్చేలా తాము బుథియా ప్రొఫైల్ను ఇస్తామని ఆయన చెప్పారు. బుథియా జగన్నాథస్వామికి మొక్కి నాలుగు గంటల ఏడు నిమిషాలకు పూరీలో తన పరుగును ప్రారంభించాడు. భువనేశ్వర్లో బుథియా ఘన సత్కారం జరిగింది. తన కొడుకు రికార్డుకు బుథియా తల్లతి సుకంఠి సింగ్ పరమానందభరితురాలైంది. ఇది గొప్ప విజయమని ఆమె అన్నది. రాష్ట్ర క్రీడా మంత్రి దేబశీష్ నాయక్ కూడా బుథియాకు స్వాగతం పలికినవారిలో ఉన్నారు.