వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సముద్ర పాయలో బస్సు పడి 27 మంది మృతి
ముంబాయి: థానే జిల్లా కాశిమిరా ప్రాంతంలో థానే మున్సిపల్ రవాణా బస్సు సముద్రం పాయలో పడిపోవడంతో 27 మంది మృతి చెందారు. ఈ దుర్ఘటన మంగళవారంనాడు జరిగింది. ప్రమాదం సంభవించినప్పుడు బస్సులో దాదాపు 80 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడినవారిని చికిత్స నిమిత్తం బోరివాలి ప్రాంతంలోని భగవతి ఆస్పత్రిలో చేర్చారు.
బస్సు ప్రమాదం మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాల ప్రాంతంలో జరిగింది. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను వెలికి తీయడానికి అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. వంతెనపై గల మలుపు తిరిగే సమయంలో డ్రైవర్ నియంత్రించలేకపోవడంతో బస్సు సముద్రం పాయలో పడిపోయినట్లు భావిస్తున్నారు. ఈ బస్సు కాశిమీరా నుంచి థానేకు బయలుదేరి వెళ్లుతోంది.
Comments
Story first published: Tuesday, May 2, 2006, 23:53 [IST]