వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గుజరాత్ వడోదరలో మళ్ళీ మత ఘర్షణలు
వడోదర: గుజరాత్ వడోదరలో హింసాకాండ బుధవారం కూడా కొనసాగుతూనే ఉంది. రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతుండడంతో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు సాయంత్రం ఈ ప్రాంతాన్ని సందర్శించి పరిస్ధితిని అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. వడొదరలో 5 కంపెనీల పారీ మిలిటరీ దళాలను మోహరించారు. సర్దార్ ఇండ్రస్టియల్ ప్రాంతంలో రెండు ఫ్యాక్టరీలను ప్రత్యర్ధి వర్గాలకు చెందిన వారు దగ్ధం చేశారు. మంగళవారం ఒక వ్యక్తిని సజీవ దహనం చేయడంతో మలి దఫా ఘర్షణలు చెలరేగాయి. వడోదర అల్లర్ల వెనుక బిజెపి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలన్న కుట్ర దాగి ఉందని బిజెపి అధికార ప్రతినిధి ముక్తార్ అబ్బాస్ నక్వి ఆరోపించారు. బిజెపి సీనియర్ నాయకుడు ఎల్కె అద్వానీ నరేంద్ర మోడీకి ఫోన్ చేసి తాజా పరిస్ధితిని తెలుసుకున్నారు.
Comments
Story first published: Wednesday, May 3, 2006, 23:53 [IST]