వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
టెన్త్ క్లాస్ ఫలితాలు
హైదరాబాద్: తాలిబాన్ల చేతిలో అఫ్గనిస్థాన్లో మరణించిన హైదరాబాదీ ఇంజనీరు కాసుల సూర్యనారాయణ రెండో భార్య స్వప్న గురువారంనాడు గవర్నర్ రామేశ్వర ఠాకూర్ను కలిశారు. తమ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆమె గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. తన ఎనిమిదేళ్ల కూతురును వెంట బెట్టుకుని ఆమె గవర్నర్ను కలిశారు. తన విజ్ఞప్తిని పరిశీలిస్తానని గవర్నర్ హామీ ఇచ్చినట్లు స్వప్న మీడియా ప్రతినిధులతో చెప్పారు.
ఇదిలావుంటే, సూర్యనారాయణ మొదటి భార్య మంజుల పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆమె పరిస్థితి కొద్దిగా మెరుగైనట్లు వైద్యులు చెబుతున్నారు. ఆమె తన తల్లిదండ్రులను గుర్తించి కొద్దిగా మాట్లాడిందని వారు చెప్పారు. తన భర్తకు రెండో భార్య ఉన్నట్లు తెలిసిన వెంటనే మంజుల ఫినాయిల్ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది.
Story first published: Thursday, May 4, 2006, 23:53 [IST]