వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మరో ఇరవై ఏళ్ళు కాంగ్రెస్కే అధికారం: కెకె
హైదరాబాద్: మరో ఇరవై ఏళ్ళపాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంటుందని పిసిసి అధ్యక్షుడు కె కేశవరావు ఆదివారం ఇక్కడ జోస్యం చెప్పారు. సేవాదళ్ వ్యవస్ధాపకుడు డాక్టర్ హర్దకర్ 177వ జయంతి సందర్భంగా ఆయన గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. సేవాదళ్ కార్యకర్తలే నిజమైన కాంగ్రెస్ పార్టీ సేవకులను ఆయన కొనియాడారు. సమాజసేవ కోసమే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని, మిగతా పార్టీలు పదవీ వ్యామోహంతో పనిచేస్తున్నాయని ఆయన విమర్శించారు.
Comments
Story first published: Sunday, May 7, 2006, 23:53 [IST]