వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
త్వరలో మద్యానికి వ్యతిరేకంగా ఉద్యమం
హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, దీనికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని జన విజ్జాన వేదిక హెచ్చరించింది. ప్రభుత్వం ఎక్సైజ్ అధికారులకు టార్గెట్లు పెట్టి మద్యం అమ్మకాలను ఉద్దృతం చేసిందని, ఇది సమాజహితానికి ఏ మాత్రం దోహ దం చేయదని, సామాన్యులు తమ ఆదాయంలో మూడో వంతు మద్యం పైనే ఖర్చు చేస్తున్నారని, చీప్ లిక్కర్ వల్ల ఆరోగ్యాలు త్వరగా చెడిపోతున్నాయని వేదిక తెలిపింది. రాష్ట్రంలో జోరుగా సాగుతున్న మద్యం వ్యాపారాలకు నిరసనగా మరో మారు మద్య వ్యతిరేక ఉద్యమం నిర్వహిస్తామని మల్లాది సుబ్బమ్మ హెచ్చరించారు. పది రోజుల్లో ముఖ్యమంత్రిని క లుసుకుని పరిస్ధితి తీవ్రతను వివరిస్తామని ఆమె చెప్పారు.
Story first published: Sunday, May 7, 2006, 23:53 [IST]