వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణపై సోనియా మౌనం వ్యూహాత్మకం: కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మౌనం వ్యూహాత్మకమని టిఆర్ఎస్ అధినేత, కేంద్ర మంత్రి చంద్రశేఖరరావు ఒక ప్రైవేటు టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తెలంగాణ అభివృద్ధి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతోనే సాధ్యమని ఆయన తెలిపారు. కాంగ్రెస్ మోసం చేయదన్న నమ్మకం తమకు ఉందని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక నక్సలైట్ల సమస్యను సరైన రీతిలో పరిష్కారం చేస్తామని చంద్రశేఖరరావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఆంధ్ర ప్రాంతం వారిని తిప్పి పంపబోమని, ఆంధ్ర పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ పరుస్తామని ఆయన చెప్పారు.
Comments
Story first published: Sunday, May 7, 2006, 23:53 [IST]