వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మహానాడుపై టిడిపిపోలిట్బ్యూరో చర్చలు
హైదరాబాద్: రాజమండ్రిలో ఈ నెలాఖరులో జరుగనున్న మహానాడు ఏర్పాట్లపై తెలుగుదేశం పార్టీ పోలిట్బ్యూరో సమావేశం ఆదివారం ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో జరిగింది. మహానాడు ఏర్పాట్లతో పాటు స్ధానిక సంస్ధల ఎన్నికల మీద కూడా చర్చ జరిగింది. ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించారు. సంస్ధాగత లోపాలను సవరించుకోవడం, చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలు మరింత సమర్ధంగా నిర్వహించడంపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఎంపీటీసీల పుఅనర్వ్యవస్ధీకరణ, ఓటర్ల జాబితాల సవరణకు సంబంధించి పార్టీ చేయాల్సిన కృషిపై కూడా చర్చ జరిగింది.
Comments
Story first published: Sunday, May 7, 2006, 23:53 [IST]