వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలుగు కవి పఠాభి కన్నుమూత
బెంగుళూరు: ప్రముఖ కవి, గణిత శాస్త్రవేత్త, సినీ నిర్మాత తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి శనివారం వేకువ జామున మూడు గంటలకు బెంగుళూరులోని తన నివాసంలో కన్నుమూశారు. నెలరోజుల కిందట ఇంట్లో జారిపడటంతో ఆయన తొడ ఎముక విరిగింది. మొన్నటి వరకు ఆయన ఉల్లాసంగానే ఉన్నారు. ఆయనకు కుమార్తె నందనారెడ్డి, కుమారుడు కోణార్క్రెడ్డి ఉన్నారు. నెల్లూరు జిల్లాలో 1919 ఫిబ్రవరి 19న ఆయన జన్మించారు. పఠాభిగా సుపరిచితులైన ఆయన ఆరు దశాబ్దాల కిందట రాసిన ఫిడేలు రాగాల డజన్ తర్వాతి తరాల కవులను ఎంతగానో ప్రభావితం చేసింది. ఆయన పలు కవితలు, కథలు రాశారు.
Comments
Story first published: Sunday, May 7, 2006, 23:53 [IST]