వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ ఎజెండా కాకూడదనే...: బిజెపి
హైదరాబాద్: తెలంగాణపై యుపిఎ సబ్ కమిటీ చైర్మన్ ప్రణబ్ ముఖర్జీ, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావుల పరస్పర విరుద్ధ ప్రకటనలపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర నాయకుడు డాక్టర్ కె. లక్ష్మణ్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో యుపిఎ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వచ్చే ఎన్నికల నాటికి ఏ పార్టీ ఎజెండాలోనూ తెలంగాణ ఉండకూడదనే ఉద్దేశంతో తెలంగాణ ఏర్పాటుకు వెంటనే పార్లమెంటులో బిల్లు ప్రతిపాదించాలని తాము డిమాండ్ చేస్తున్నామని ఆయన చెప్పారు. కాంగ్రెస్, తెరాసలు ప్రజలను మభ్యపెట్టడం మానేసి తెలంగాణ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. అరగంటలోనే ప్రణబ్ ముఖర్జీ మాట మార్చి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారని ఆయన విమర్శించారు.
Story first published: Monday, May 8, 2006, 23:53 [IST]