వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నెల్లిమర్ల జూట్ మిల్లు లాకౌట్
విజయనగరం: విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల జూట్ మిల్లును యాజమాన్యం మూసివేసింది. దీంతో కార్మికులు ధర్నాకు దిగారు. ఐదు వేల మంది కార్మికులు ఈ మిల్లులో పని చేస్తున్నారు. మరో 30 వేల మంది దీని ద్వారా ఉపాధి పొందుతున్నారు.
నెల్లిమర్ల జూట్ మిల్లుకు లాకౌట్ ప్రకటించడం ఇది ఆరోసారి. 1994లో లాకౌట్ ప్రకటించినప్పుడు కార్మికులు పెద్ద యెత్తున ఆందోళనకు దిగారు. ఈ సమయంలో పోలీసులు కాల్పులు జరపడంతో ఐదుగురు కార్మికులు మరణించారు. యాజమాన్యం ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా మిల్లును మూసివేసిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. అక్రమ లాకౌట్ను నిరసిస్తూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని వారు చెప్పారు. నెల్లిమర్లలో 144వ సెక్షన్ విధించారు.
Comments
Story first published: Monday, May 8, 2006, 23:53 [IST]