పేలుడుకు పాల్పడింది ఐయస్ఐ తీవ్రవాదులు?
హైదరాబాద్: హైదరాబాద్లోని ఓడియన్ థియేటర్లో జరిగిన బాంబు పేలుడు వెనక పాకిస్థాన్కు చెందిన ఐయస్ఐ పాత్ర ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఓడియన్ థియేటర్లో ఆదివారంనాడు బాంబు పేలి ముగ్గురు గాయపడ్డారు. ఓడియన్ థియేటర్లో పేలింది గ్రెనేడ్ బాంబు అనే నిర్ధారణకు పోలీసులు వచ్చారు. అయితే ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక వచ్చేవరకు ఏమీ లేదని పోలీసులు ఉన్నతాధికారులు అంటున్నారు.
పేలుడు పదార్థాలను బట్టి వాటిని వాడే సంస్థ ఏమై ఉంటుందనే విషయం తెలుసుకోవడంపై పోలీసులు దృష్టి పెట్టారు. బాంబులో క్రైనైట్రో టోలిన్, నైట్రో గ్లిజరిన్ పేలుడు పదార్థాలు వాడినట్లు పోలీసులు తేల్చుకున్నారు. ఈ పేలుడు పదార్థాలను గతంలో ఐయస్ఐ తీవ్రవాదులు వాడినట్లు వారి దృష్టికి వచ్చింది. వీటిని నక్సల్స్ వాడరని వారంటున్నారు. అందువల్ల దీన్ని వాడింది ఐయస్ఐ తీవ్రవాదులే అయి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. గ్రెనేడ్ లివర్పై గల నెంబరు ఆధారంగా కూడా పేలుడుకు బాధ్యులైనవారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.