వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నిపుణుల నివేదిక తర్వాతే సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ: గోదావరినదిపై మహారాష్ట్ర నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టుపై తీర్పును నిపుణుల కమిటీ నివేదిక తర్వాతనే వెల్లడిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బాబ్లీ ప్రాజెక్టుపై విచారణను ఛీఫ్ జస్టిస్ సబర్వాల్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ ఆగస్టు 21వ తేదీకి వాయిదా వేసింది. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపించాలని కోరుతూ నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ గౌడ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
బాబ్లీ ప్రాజెక్టుపై మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఒక నిపుణుల కమిటీని నియమించాయి. ఈ నిపుణుల కమిటీ తన నివేదికను సమర్పించాల్సి ఉంది. ఈ నివేదక వచ్చిన తర్వాతనే తాము తీర్పు వెలువరిస్తామని సుప్రీంకోర్టు సోమవారంనాడు తెలియజేసింది.
Comments
Story first published: Monday, May 8, 2006, 23:53 [IST]