వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సిఎంగా హుందాగా ఉండండి: వైఎస్కు బాబు సలహా
హైదరాబాద్: ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తన పదవికి తగ్గట్టు హుందాగా వ్యవహరించాలని, దిగుజారుడుగా వ్యాఖ్యానాలు చేయడం తగదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం ఇక్కడ అన్నారు. రెండేళ్ళుగా రాజశేఖరరెడ్డ వ్యవహార శైలిని గమనిస్తే ఆయన ధోరణి అర్ధమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. తన తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు తెలుగుదేశం పార్టీలో తిరిగి చేరడాన్ని ఆక్షేపించడం తగదని, ఇతరులు ఎలా టిడిపిలో చేరుతున్నారో, ఇది కూడా అటువంటిదేనని చంద్రబాబు అన్నారు. మూడు నెలల్లో వైఎస్ రాజకీయ సన్యాసం తీసుకోక తప్పదని ఆయన అన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మూడో ఫ్రంట్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని అయన చెప్పారు. ఇలా ఉండగా చంద్రబాబు నాయుడు పార్టీని నియోజకవర్గాల వారీగా పటిష్టం చేసే కృషిలో ఉన్నారు.
Comments
Story first published: Tuesday, May 9, 2006, 23:53 [IST]