వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసు కస్టడీకి మొద్దు శీను అప్పగింత

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: మాజీ నక్సలైట్‌ వెంకటరెడ్డి హత్య కేసులో జూలకంటి శ్రీనివాస రెడ్డి అలియాస్‌ మొద్దు శీనును కోర్టు రెండు రోజుల కోసం పోలీసు కస్టడీకి అప్పగించింది. దీంతో రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ పోలీసులు మొద్దు శీనును తమ కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

విచారణ నిమిత్తం మొద్దు శీనును మూడు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని హయత్‌నగర్‌ పోలీసులు ఏడో మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ను కోరారు. దీంతో రెండు రోజుల పాటు మొద్దు శీనును పోలీసు కస్టడీకి అప్పగిస్తూ మెజిస్ట్రేట్‌ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి హత్య కేసులో మొద్దు శీను నిందితుడనే విషయం తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X