వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
క్రికెట్ మ్యాచ్లను డిడి ప్రసారం చేయవద్దు: సుప్రీం
న్యూఢిల్లీ: భారత్ - వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే క్రికెట్ సిరీస్ను ప్రసారం చేయకూడదని సుప్రీంకోర్టు దూరదర్శన్ను ఆదేశించింది. ఈ సిరీస్ ప్రసారానికి సంబంధించిన సర్వ హక్కులు టెన్ స్పోర్ట్స్కే ఉంటాయని సుప్రీంకోర్టు మంగళవారం తేల్చి చెప్పింది. భారత్ - వెస్టిండీస్ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ ఈ నెల 18వ తేదీన జమైకాలో జరుగుతుంది.
భారత్ - వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే క్రికెట్ సిరీస్ ప్రసారాలను పంచుకోవడానికి అనుమతించాలని దూరదర్శన్ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. టెన్స్పోర్ట్స్కే మ్యాచ్ల సర్వహక్కులు దక్కుతాయని, ఈ ప్రసారాలను దూరదర్శన్తో పంచుకోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు వివరించింది.
Comments
Story first published: Tuesday, May 9, 2006, 23:53 [IST]