వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నాకేం భయం, నక్సల్స్ పిలిస్తే వెళ్తా: ఎమ్మెస్సార్
కరీంనగర్: తాను నక్సల్స్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు అడవిలోకి వెళ్తానని క్రీడలు, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ఎం. సత్యనారాయణ రావు అన్నారు. తాను ఎవరికీ భయపడనని, తనను పుట్టించిన బ్రహ్మదేవుడికి కూడా తాను భయపడనని ఆయన అన్నారు. నక్సలైట్లు తనను టార్గెట్ చేసుకున్నారని వచ్చిన వార్తలపై ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రతిస్పందించారు.
తాను నక్సలైట్లకు నాయకత్వం వహించడానికి కూడా సిద్ధంగా ఉన్నానని, నెల రోజుల పాటు వారితో వుండి వారికి శిక్షణ ఇవ్వడానికి కూడా తాను సిద్ధమేనని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు, ఆ పార్టీ నాయకుడు టి. దేవేందర్ గౌడ్కు మధ్య విభేదాలున్నాయని ఆయన చెప్పారు. మంత్రివర్గ విస్తరణ జరగకపోవడం వల్ల మంత్రులు, శాసనసభ్యులు అసంతృప్తితో ఉన్నారని ఆయన అన్నారు.
Comments
Story first published: Wednesday, May 10, 2006, 23:53 [IST]