వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాజ్యసభలో తెలుగులో మైసురా ప్రమాణం
న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికైన డాక్టర్ ఎం.వి. మైసురారెడ్డి తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభలో ఆయన బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగు తన మాతృభాష కాబట్టి తెలుగులో ప్రమాణ స్వీకారం చేశానని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.
తెలుగుకు ప్రాచీన భాష హోదా లభించేలా తాను కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తెలుగు ఆత్మగౌరవం కోసం ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ తరఫున తాను రాజ్యసభకు ఎన్నిక కావడం గర్వంగా భావిస్తున్నానని ఆయన చెప్పారు. కాంగ్రెస్ తరఫున రాజ్యసభకు ఎన్నికైన దాసరి నారాయణరావు, డాక్టర్ కె. కేశవరావు కూడా ప్రమాణస్వీకారం చేశారు.
Comments
Story first published: Wednesday, May 10, 2006, 23:53 [IST]