వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సూర్యం హంతకులను పట్టుకోండి: పార్లమెంటు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇంజనీర్ కె. సూర్యనారాయణను అఫ్గనిస్థాన్లో తాలిబన్లు హత్య చేయడాన్ని పార్లమెంటు ఉభయ సభలు ఖండించాయి. సూర్యనారాయణ హత్య కేసులో నిందితులను అరెస్టు చేయడానికి చర్యలు చేపట్టాలని పార్లమెంటు అఫ్గనిస్థాన్ ప్రభుత్వాన్ని కోరింది. అఫ్గనిస్థాన్ ప్రభుత్వం హంతకులను పట్టుకుని, చట్టం ముందు నిలబెడుతుందని ఆశిస్తున్న లోక్సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ, రాజ్యసభ చైర్మన్ బైరాన్ సింగ్ షెకావత్ విడివిడిగా ప్రకటనలు చేశారు.
సార్వభౌమ, స్థిర, ప్రజాస్వామిక, సంపన్న దేశంగా తమ దేశాన్ని తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్న అఫ్గనిస్థాన్ ప్రజలకు, ప్రభుత్వానికి పార్లమెంటు ఉభయ సభలు సంఘీభావం ప్రకటించాయి. సూర్యనారాయణను తాలిబన్లు అఫ్గనిస్థాన్లో కిడ్నాప్ చేసి గత నెల 29వ తేదీన హత్య చేశారు.
Story first published: Wednesday, May 10, 2006, 23:53 [IST]