వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అనంతలో మరో టిడిపి కార్యకర్త హత్య
అనంతపురం: అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆదిరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. అనంతపురం జిల్లా సింగనమల మండలం గుమ్మెపల్లిలో ఆదిరెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి చంపారు. ఈ హత్యతో అనంతపురం జిల్లాలో హత్యకు గురైనవారి సంఖ్య 28కి చేరుకుంది. నిద్రిస్తుండగా ఆదిరెడ్డిని గుట్టు చప్పుడు కాకుండా హత్య చేశారు.
ఆదిరెడ్డికి పాత కక్షలేవీ లేవని, ఎవరితోనూ గొడవలు లేవని అంటున్నారు. ఆదిరెడ్డి సోదరుడు గ్రామ సర్పంచు. ఈ రాజకీయ పలుకుబడిని తగ్గించడానికే ఆదిరెడ్డిని హత్య చేసి వుంటారని అనుమానిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తుండడమే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు.
Comments
Story first published: Wednesday, May 10, 2006, 23:53 [IST]