వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వచ్చే ఏడాదికల్లా సాగర్ మరమ్మతులు: వైయస్
గుంటూరు: వచ్చే ఏడాదికల్లా నాగార్జునసాగర్ మరమ్మత్తులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చెప్పారు. 2,250 కోట్ల రూపాయలతో సాగర్ మరమ్మతులు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. బుధవారంనాడు ఆయన గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రజాపథం కార్యక్రమాన్ని నిర్వహించారు.
గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పేదలకు ఇళ్లు ఇవ్వలేకపోతే తన జీవితం వ్యర్థమని ఆయన అన్నారు. రాష్ట్రంలోని 55 లక్షల మందికి ఇళ్లు నిర్మించి ఇస్తామని ఆయన చెప్పారు. మంగళగిరిలో ఆయన 40 నిమిషాల పాటు ఉన్నారు.
Comments
Story first published: Wednesday, May 10, 2006, 23:53 [IST]