రికార్డు మెజారిటీతో సోనియా విజయం
లక్నో: రాయబరేలీ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రికార్డు మెజారిటీతో విజయం సాధించారు. ఆమె సమీప సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిపై 4,17,888 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. తమ తల్లి సోనియా ఘన విజయం సాధిస్తుందని తమకు తెలుసునని ఎన్నికల ఇన్చార్జిగా వ్యవహరించిన ప్రియాంక వద్రా అన్నారు. బిజెపి నేత, బిజెపి రాయ్బరేలీ అభ్యర్థి వినయ్ కతియార్తో పాటు సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి రాజ్కుమార్ చౌదరి డిపాజిట్లు కోల్పోయారు.
రాయబరేలీలో సోనియా విజయం తర్వాత ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రియాంకతో పాటు రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. ఓటర్లకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. లాభదాయక పదవి విషయంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సోనియా తన లోక్సభ స్థానానికి మార్చిలో రాజీనామా చేశారు. తమ తల్లి విజయానికి తన సోదరుడు రాహుల్ గాంధీయే కారణమని ప్రియాంక అన్నారు. ఎన్నికల ప్రచార బాధ్యతను రాహుల్ గాంధీ నిర్వహించారు. తన తల్లి విజయం ఖ్యాతి ఓటర్లకే దక్కుతుందని రాహుల్ అన్నారు.