యుపిఎకు అనుకూలం:వైయస్- కాదు: బాబు
ఆదిలాబాద్/హైదరాబాద్: ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల ఫలితాలు ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ)కు అనుకూలంగా వచ్చాయని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఐదు రాష్ట్రాల్లోనూ డియంకె, వామపక్షాలు, కాంగ్రెస్ విజయం సాధించాయని ఆయన అంటూ ఇంతకన్నా కావాల్సిందేమిటని ప్రశ్నించారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ఎన్నికల ఫలితాలపై ఆ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్కు మద్దతు లేదనడానికి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నిదర్శనమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. యుపిఎ పనితీరును ప్రజలు ఇష్టపడడం లేదనే విషయాన్ని ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ విధానాలను ప్రజలు అంగీకరించడం లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్, బిజెపిలకు ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తామని ఆయన చెప్పారు. పశ్చిమ బెంగాల్, కేరళ విజయం రాష్ట్ర సిపియం వర్గాల్లో కూడా ఆనందోత్సాహాలను నింపింది. సిపియం కార్యకర్తలు గురువారం హైదరాబాద్లో ర్యాలీ నిర్వహించారు. ప్రజా వ్యతిరేక విధానాలకు స్వస్తి చెప్పాలని సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు కోరారు.