వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తమిళ సియంగా రేపు కరుణ ప్రమాణం
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా డియంకె అధినేత ఎం. కరుణానిధి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.డియంకె శాసనసభా పక్షం నాయకుడిగా కరుణానిధి లాంఛనంగా శుక్రవారంనాడు ఎన్నికయ్యారు. కరుణానిధి శుక్రవారం ఉదయం గవర్నర్ కలిసి మద్దతు లేఖలను సమర్పించారు.
తమిళనాడు మొదటిసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతోంది. అయితే మిత్రపక్షాలు మంత్రివర్గంలో చేరవని అంటున్నారు. కరుణానిధి ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ హాజరయ్యే అవకాశాలున్నాయి. డియంకెకు సిపియం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ మద్దతు ప్రకటించారు.
Comments
Story first published: Friday, May 12, 2006, 23:53 [IST]