కాంగ్రెస్లోకి తెరాస అసమ్మతి గణం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అసమ్మతి శాసనసభ్యులు నలుగురు తమ అనుచరులను కాంగ్రెస్లో చేర్చేందుకు రంగం సిద్ధమైంది. శనివారం మధ్యాహ్నం వారు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరనున్నారు. తమ అనుచరులను, బంధువులను కాంగ్రెస్లో చేర్చే తెరాస అసమ్మతి శాసనసభ్యుల్లో దుగ్యాల శ్రీనివాసరావు, గీట్ల ముకుంద రెడ్డి, బండారు శారారాణి ఉన్నారు.తమ బంధువులను, అనుచరులను దగ్గరుండి కాంగ్రెస్లో చేర్పించేందుకు వారు ఇప్పటికే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావుతో చర్చలు జరిపారు.
రేపు ఒంటి గంట సమయంలో వైయస్, కేశవరావుల సమక్షంలో వారు తమ అనుచరులను కాంగ్రెస్లో చేరుస్తారు. చాలా కాలంగా వారు తెరాస నాయకత్వంపై బహిరంగ విమర్శలు కురిపిస్తూ వస్తున్నారు. వారి ఆలోచనను పసిగట్టిన తెరాస నాయకత్వం వారిపై వేటు వేయడం లేదు. వేటు వేసిన వెంటనే కాంగ్రెస్లో చేరేందుకు వారు రంగం సిద్ధం చేసుకున్నారని తెలుసుకున్న తెరాస నాయకత్వం వారిపై సస్పెన్షన్ వేటు వేయలేదు. దీంతో విసుగు చెందిన ఆ నలుగురు అసమ్మతి శాసనసభ్యులు ఎట్టకేలకు తమ అనుచరులను, బంధువులను కాంగ్రెస్లో చేర్చేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది.