వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అసోం సిఎంగా 17న తరుణ్ గొగోయ్ ప్రమాణం
గౌహతి: అసోం కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా తరుణ్ గొగోయ్ శనివారం ఎన్నికయ్యారు. ఆయన ఈనెల 17న అసోం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. 53 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందువల్ల తరుణ్ గొగోయ్ ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం కేవలం లాంఛనం మాత్రమే. ఎఐసిసి ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్, కాంగ్రెస్ పరిశీలకులు మొహిసినా కిద్వాయ్, చందన్ బగ్చి సమక్షంలో 53 మంది ఎమ్మెల్యేలు తరుణ్ గొగోయ్కి మద్దతు పలికారు. ముఖ్యమంత్రి అభ్యర్ధి గొగోయ్ గవర్నర్ను కలుసుకుని తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల జాబితాను సమర్పించారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న బోడోల్యాండ్ పీపుల్స్ ప్రోగ్రెసివ్ ఫ్రంట్ గొగోయ్కి మద్దతు ఇస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా గొగోయ్ని గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ అజయ్ సిన్హా ఆహ్వానించారు.
Comments
Story first published: Saturday, May 13, 2006, 23:53 [IST]