వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోడ్డు ప్రమాదంలో 13 మంది టిఆర్ఎస్ కార్యకర్తల మృతి
హైదరాబాద్: మెదక్ జిల్లా గజ్వాల్, గౌరారం గ్రామంవద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది తెలంగాణా రాష్ట్ర సమితి కార్యకర్తలు మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. వీరంతా టి ఆర్ ఎస్ అసమ్మతివర్గం ఎమ్మెల్యే గీట్ల ముకుందారెడ్డి అనుచరులు. శనివారం హైదరాబాద్లోని గాంధీభవన్లో టి ఆర్ ఎస్ నేతలు కొంత మంది కాంగ్రెస్లో చేరనుండడంతో కార్యకర్తలు కరీంనగర్ నుంచి హైదరాబాద్ వస్తున్నారు. వీరు వస్తున్న బస్సును లారీ ఢీకొనడంతో ఈ ఘటన సంభవించింది. తీవ్రంగా గాయపడినవారిని సిద్దిపేట ఆస్పత్రిలో ప్రథమచికిత్స చేసి అనంతరం హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతులంతా కరీంనగర్ జిల్లా చీకురాయికి చెందిన వారని తెలుస్తోంది.
Comments
Story first published: Saturday, May 13, 2006, 23:53 [IST]