వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌ ఆదేశాల మేరకు సూర్యం హత్య: తాలిబాన్లు

By Staff
|
Google Oneindia TeluguNews

కాందహార్‌: పాకిస్థాన్‌ ఆదేశాల మేరకే హైదరాబాద్‌కు చెందిన ఇంజనీర్‌ను చంపామని తాలిబాన్లు ప్రకటించారు. సూర్యనారాయణ హత్య వెనక పాకిస్థాన్‌ ఐయస్‌ఐ హస్తం ఉందని తాలిబాన్‌ కమాండర్‌ చెప్పాడు. అఫ్గాన్‌ టీవీలో ఈ విషయమైన తాలిబాన్ల ప్రకటన ప్రసారమైంది. సూర్యనారాయణ హత్య తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సూర్యనారాయణ ఒక ప్రైవేట్‌ కంపెనీలో పని చేస్తూ తాలిబాన్ల చేతిలో బలయ్యారు.

సూర్యనారాయణను తాలిబాన్లు ఇటీవల కిడ్నాప్‌ చేశారు. భారతీయులు 24 గంటల లోగా అఫ్గాన్‌ వీడి వెళ్లకపోతే సూర్యనారాయణను చంపేస్తామని తాలిబాన్లు గడువు పెట్టారు. అయితే గడువు కన్నా ముందే తాలిబాన్లు సూర్యనారాయణను హత్య చేశారు. తాలిబాన్ల తాజా ప్రకటన పాకిస్థాన్‌, భారత్‌ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X