వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పోలీసుల వైఫల్యంపై అనంత కోర్టు అసంతృప్తి
అనంతపురం: తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి ఇంటి పేల్చివేత కుట్ర కేసులో నిందితులందరినీ పట్టుకోవడంలో పోలీసులు వైఫల్యం చెందడం పట్ల అనంతపురం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పరిటాల ఇంటి పేల్చివేత కుట్ర, తగరకుంట ప్రభాకర్ హత్య కేసుల్లో మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ మద్దెలచెర్వు సూరిని మంగళవారం కోర్టు హాజరు పరిచారు. సూరికి ఈ నెల 30వ వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
పరిటాల ఇంటి పేల్చివేత కుట్ర కేసు నమోదై నాలుగేళ్లు గడిచినా పోలీసులు ఇప్పటి వరకు నిందితులందరినీ పట్టుకోలేకపోవడం పట్ల కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పోలీసు సిబ్బంది సక్రమంగా పని చేసేలా చూడాలని కోర్టు జిల్లా పోలీసు సూపరింటిండెంట్ (యస్పీ)ని ఆదేశించింది.
Comments
Story first published: Tuesday, May 16, 2006, 23:53 [IST]