వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖ ఏజెన్సీ భారీ నక్సల్స్‌ డంప్‌ స్వాధీనం

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టుల భారీ డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇజ్రాయెలీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన 50 మందుపాతరలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంత అత్యధునాతనమైన మందుపాతరలు మావోయిస్టులు సమీకరించుకున్నట్లు బయటపడడం ఇదే మొదటిసారి అని విశాఖపట్నం జిల్లా పోలీసు సూపరింటిండెంట్‌ (యస్సీ) వి.వి. శ్రీనివాస రావు మీడియా ప్రతినిధులకు చెప్పారు.

పోలీసులు అప్రమత్తమై అన్వేషణలో ఫలితాలు సాధిస్తుండడంతో పోలీసులు మందుపాతరలను స్వాధీనం చేసుకునే సమయంలోనే పేలేలా మావోయిస్టులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటున్నారని ఆయన చెప్పారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న మందుపాతరలు ఒక్కొక్కటి అర కిలో బరువు ఉంటుందని ఆయన చెప్పారు. విశాఖపట్నం జిల్లా జి.కె. వీధి మండలం నేరెల్లబండ గ్రామం సమీపంలో పోలీసులు 50 జిలెటన్‌ స్టిక్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X