వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిజర్వేషన్‌ వ్యవహారంపై కేంద్ర మంత్రుల కమిటీ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రిజర్వేషన్ల వ్యవహారంపై ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ నలుగురు మంత్రులతో ఒక కమిటీని వేశారు. ఈ త్రిసభ్య కమిటీలో అర్జున్‌ సింగ్‌, ప్రణబ్‌ ముఖర్జీ, చిదంబరం, భరద్వాజ ఉంటారు. ఒబిసి రిజర్వేషన్ల కోటా విషయంలో తలెత్తిన వ్యవహారాన్ని ఈ త్రిసభ్య సంఘం పరిశీలిస్తుంది.

ఇదిలావుంటే, ఒబిసి కోటాను వ్యతిరేకిస్తూ ప్రారంభించిన వైద్య విద్యార్థులు ప్రారంభించిన నిరాహారదీక్షలు బుధవారంనాటికి నాలుగో రోజుకు చేరుకున్నాయి. జూనియర్‌ డాక్టర్ల సమ్మెతో ఢిల్లీలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు స్తంభించాయి. రిజర్వేషన్ల వ్యవహారంపై బుధవారం పార్లమెంటు ఉభయ సభల్లో తీవ్ర చర్చ జరిగింది. ఒబిసి కోటాపై చెలరేగుతున్న ఉద్యమం విషయంలో పార్లమెంటు ఉభయసభల్లో ప్రతిపక్ష బిజెపి సభ్యులు ప్రభుత్వతీరును తీవ్రంగా దుయ్యబట్టారు. దీంతో ఉభయ సభల్లోనూ తీవ్ర గందరగోళం నెలకొంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X