వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాద్లో ఏడేళ్ల పాప కిడ్నాప్
హైదరాబాద్: హైదరాబాద్లోని హిమాయత్ నగర్ నుంచి ఏడేళ్ల పాప కిడ్నాప్నకు గురైంది. మానసి అనే బాలికను ఆగంతకులు కిడ్నాప్ చేసి ఆమె తండ్రి నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. మొదట పాప తప్పిపోయిందని భావించారు. అయితే ఒక వ్యక్తి ఫోన్ చేసి మానసి తండ్రి నుంచి డబ్బులు డిమాండ్ చేయడంతో పాప కిడ్నాప్నకు గురైనట్లు ధృవీకరించుకున్నారు.
మానసి తండ్రికి హైదరాబాద్లోని చిక్కడపల్లి ప్రాంతం నుంచి ఆ ఫోన్ వచ్చినట్లు తెలుస్తోంది. పాపను కిడ్నాప్ చేసిన వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. పాప చాలా సేపు ఒక ఎటియం సెంటర్ వద్ద కూర్చుంది. తన తండ్రి వచ్చేసరికి ఆమె లేదు. దీంతో అతను తీవ్ర ఆందోళనకు గురయ్యాడు.
Comments
Story first published: Wednesday, May 17, 2006, 23:53 [IST]