వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోడ్డు ప్రమాదంలో నలుగురు సజీవదహనం
అనంతపురం: అనంతపురం జిల్లా బెంగుళూర్ - హైదరాబాద్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదం గురువారం ఉదయం కల్లూరు సమీపంలో జరిగింది. తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తున్న కారును హైదరాబాద్ నుంచి వస్తున్న సఫారీ వాహనం ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు.
సఫరీ వాహనం ఢీకొట్టడంతో కారు ఆయిల్ ట్యాంకర్ పగిలి మంటలు లేచాయి. ఈ మంటల్లో చిక్కుకుని కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు, డ్రైవర్ అక్కడికక్కడే మరణించగా, ఒక బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఒక బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సఫారీ వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరికి స్వల్పంగా గాయాలయ్యాయి. వీరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Comments
Story first published: Thursday, May 18, 2006, 23:53 [IST]