వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు ప్రమాదంలో నలుగురు సజీవదహనం

By Staff
|
Google Oneindia TeluguNews

అనంతపురం: అనంతపురం జిల్లా బెంగుళూర్‌ - హైదరాబాద్‌ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదం గురువారం ఉదయం కల్లూరు సమీపంలో జరిగింది. తిరుపతి నుంచి హైదరాబాద్‌ వస్తున్న కారును హైదరాబాద్‌ నుంచి వస్తున్న సఫారీ వాహనం ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు.

సఫరీ వాహనం ఢీకొట్టడంతో కారు ఆయిల్‌ ట్యాంకర్‌ పగిలి మంటలు లేచాయి. ఈ మంటల్లో చిక్కుకుని కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు, డ్రైవర్‌ అక్కడికక్కడే మరణించగా, ఒక బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఒక బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సఫారీ వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరికి స్వల్పంగా గాయాలయ్యాయి. వీరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X