వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బుద్ధదేవ్ ప్రమాణానికి సానియా హాజరు
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బుద్ధదేవ్ భట్టాచార్య ప్రమాణస్వీకారోత్సవానికి హైదరాబాద్ టెన్సిల్ సంచలనం సానియా మీర్జా హాజరైంది. బుద్ధదేవ్ భట్టాచార్య పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా రెండోసారి గురువారం రైటర్స్ భవన్లో ప్రమాణం చేశారు. గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ బుద్ధదేవ్ భట్టాచార్య చేత ప్రమాణం చేయించారు. భట్టాచార్యతో పాటు 44 మంది మంత్రులు ప్రమాణం చేశారు. ఇందులో 17 మంది కొత్తవారు.
భట్టాచార్య ప్రమాణ స్వీకారోత్సవానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. దాదాపు 150 మంది ప్రముఖులు ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. ప్రముఖ వాణిజ్యవేత్తలు రతన్ టాటా, అజీం ప్రేంజీతో పాటు పలువురు హాజరయ్యారు. క్రీడాకారులు సౌరవ్ గంగూలీ, మహేష్ భూపతి, లియాండర్ పేస్ కూడా పాల్గొన్నారు.
Comments
Story first published: Thursday, May 18, 2006, 23:53 [IST]