వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తొమ్మిదేళ్ల అభివృద్ధి వైయస్ చేతిలో నాశనం: బాబు
ఖమ్మం: తమ తొమ్మిదేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధిని ప్రస్తుత ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి కూలదోశారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో పేదలకు ఒరగబెట్టిందేమీ లేదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కాంగ్రెస్ జాతీయ స్థాయి పార్టీ నుంచి ప్రాంతీయ స్థాయి పార్టీకి దిగజారిందని ఆయన వ్యాఖ్యానించారు.
అవినీతిని ప్రశ్నిస్తే కాంగ్రెస్వారు బురదజల్లుతున్నారంటూ తమపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. అనుమతులు లేకుండా పోలవరం ప్రాజెక్టును చేపట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన అడిగారు. దుమ్ముగూడెం ప్రాజెక్టును తమ హయాంలో ప్రారంభించామని ఆయన చెప్పుకున్నారు.
Comments
Story first published: Friday, May 19, 2006, 23:53 [IST]