వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హిందుస్ధాన్ షిప్యార్డ్కు 2వేలకోట్లు: ప్రధాని
విశాఖపట్నం: హిందుస్ధాన్ షిప్ యార్డ్ సంస్ధ పునర్ వ్యవస్ధీకరణకు 2వేల కోట్ల రూపాయలు మంజూరు చేయనున్నట్టు ప్రధాని మన్మోహన్ సింగ్ శనివారం ఇక్కడ ప్రకటించారు. దేశంలోనే గొప్ప పారిశ్రామిక నగరంగా విశాఖ రూపుదిద్దుకొందని, రెండువేల ఏళ్ళ క్రితమే విశాఖ నగరం భారత్ నుంచి ఇతర ఆసియా దేశాలకు ముఖద్వారంగా పనిచేసిందని ప్రధాని కొనియాడారు. విశాఖలో డ్వాక్రా మహిళలతో ఆయన కొంచెం సేపు ముచ్చటించి వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ విశాఖపట్నం సందర్శించడం ఇదే ప్రధమం. పారిశ్రామికీకరణ వల్ల పర్యావవరణం దెబ్బతినకూడదని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
Comments
Story first published: Saturday, May 20, 2006, 23:53 [IST]