వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎవరు ఏమైనా మాట్లాడవచ్చు: కేశవరావు
హైదరాబాద్: తెలంగాణపై ఎవరూ మాట్లాడకూడదని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చేసిన ప్రకటనతో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు విభేదించారు. శాసనసభ్యులు వారి వారి అభిప్రాయాలను వెల్లడించవచ్చునని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఎవరూ మాట్లాడకపోవడానికి కాంగ్రెస్ స్మశానవాటిక పార్టీ కాదని ఆయన అన్నారు.
మాట్లాడినంత మాత్రన ఘర్షణ కాదని, విభేదించినంత మాత్రాన, అభిప్రాయభేదాలున్నంత మాత్రాన విభేదాలు కావని ఆయన అన్నారు. అందరూ వారి వారి అభిప్రయాలను స్వేచ్ఛగా వెల్లడించడమే ప్రజాస్వామ్యమని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరికి వారు అభిప్రాయాలను వెల్లడించినప్పుడు ఒక నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుందని ఆయన అన్నారు.
Comments
Story first published: Sunday, May 21, 2006, 23:53 [IST]