వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పోలవరంపై ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి
ఖమ్మం: గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు పనులను ఆపేయాలని, దుమ్ముగూడెం ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపియం కార్యకర్తలు సోమవారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ను ముట్టడించారు. పోలవరం ప్రాజెక్టు ఖమ్మం జిల్లాను ముంచేస్తుందని సిపియం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్ అన్నారు.
పోలవరం ప్రాజెక్టు పనులు ఆపేయాలని సుప్రీంకోర్టు సాధికారిక కమిటీ ఆదేశించిందని, అయినా పనులు సాగుతున్నాయని ఆయన అన్నారు. దుమ్ముగూడెం ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని ఎన్ని మార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. దుమ్ముగూడెం ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేయడంతోనే సరిపోయిందని అనుకుంటున్నారని ఆయన అన్నారు.
Comments
Story first published: Monday, May 22, 2006, 23:53 [IST]