వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇక బిజెపి తెలంగాణ ఉద్యమం ఉధృతం
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ డిమాండ్తో భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఉద్యమాన్ని ఉధృతం చేయాలని తలపెట్టింది. అందులో భాగంగా వచ్చే నెల 2వ తేదీన హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించుకుంది. ఈ బహిరంగ సభలో బిజెపి జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్తో పాటు పార్టీ అగ్రనాయకులు, బిజెపికి చెందిన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పద్ధతిలో కాకుండా ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసికెళ్లాలని బిజెపి అనుకుంటోంది. గత కొద్ది రోజులుగా బిజెపి తెలంగాణ కోసం గొంతును పెంచింది. బిజెపి వైఖరితో తెలంగాణపై తెరాస మీద, కాంగ్రెస్ మీద ఒత్తిడి పెరిగింది. ఆ ఒత్తిడిని మరింత పెంచడంతో పాటు ప్రజల్లోకి చొచ్చుకుపోయేందుకు బిజెపి తన వ్యూహాన్ని రచించుకుంటోంది.
Comments
Story first published: Wednesday, May 24, 2006, 23:53 [IST]