వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రైవేట్ విద్యాసంస్థలపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్: ప్రైవేట్ విద్యాసంస్థల తీరుపై రాష్ట్ర హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రైవేట్ విద్యాసంస్థలు వాణిజ్య ప్రకటనలను వెంటనే ఆపేయాలని హైకోర్టు బుధవారం ఆదేశించింది. వరంగల్కు చెందిన శ్రీనివాసరాజు వేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది.
ప్రైవేట్ విద్యాసంస్థల పరిస్థితిపై నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. వాణిజ్య ప్రకటలను ఇవ్వడానికి ప్రైవేట్ విద్యాసంస్థలకు డబ్బులు ఎలా వస్తున్నాయనే అంశంపై ఆదాయం పన్ను శాఖ అధికారులు పరిశీలన జరిపి నివేదిక ఇవ్వాలని కూడా హైకోర్టు ఆదేశించింది.
Comments
Story first published: Wednesday, May 24, 2006, 23:53 [IST]