వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముందు సీమ సంగతి తేల్చండి: టి.జె. వెంకటేష్
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు తమ సంగతి తేల్చాలని రాయలసీమ సంఘర్షణ సమితి అధ్యక్షుడు టి.జె. వెంకటేష్ కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని, అయితే ఆ రాష్ట్ర ఏర్పాటుకు ముందు రాయలసీమ విషయాన్ని పరిశీలించాలని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
హైదరాబాద్ను దేశం రెండో రాజధానిగా ఏర్పాటు చేసి, కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని ఆయన అన్నారు. రాయలసీమ సమస్యను కొలిక్కి తెచ్చిన తర్వాతనే తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. సమైక్యాంధ్రలో కలిసిపోయినప్పుడు రాయలసీమ రాజధానిని కోల్పోయిందని ఆయన అన్నారు.
Comments
Story first published: Wednesday, May 24, 2006, 23:53 [IST]