వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దిక్కు తోచక బాబుపై కెసిఆర్ వ్యాఖ్యలు: టిడిపి
హైదరాబాద్: దిక్కుతోచని స్థితిలోనే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు తమ నేత నారా చంద్రబాబునాయుడిపై వ్యాఖ్యలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు రావుల చంద్రశేఖర రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ తదితరులు విమర్శించారు. చంద్రబాబుపై చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలపై వారు బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ప్రతిస్పందించారు.
తెలంగాణ విషయంలో ప్రజలు వాస్తవాలు గ్రహించారని, అందువల్లనే చంద్రశేఖర రావు నిరాశానిస్పృహలకు గురయ్యారని వారన్నారు. తెలంగాణకు ఇక డెడ్లైన్లు లేవని అన్ని లైన్లు డెడ్ అయ్యాయని వారన్నారు. చంద్రశేఖర రావు సంస్కార హీనంగా మాట్లాడుతున్నారని వారన్నారు. దుర్మార్గంగా మాట్లాడటం చంద్రశేఖరరావుకు తగదని వారన్నారు. చంద్రశేఖరరావుకు మతి భ్రమించిందని వారు వ్యాఖ్యానించారు.
Comments
Story first published: Wednesday, May 24, 2006, 23:53 [IST]